Sunday, August 2, 2009

ఈ దాడులు జీవితాన్ని తీర్చి దిద్దుతాయా?2

జూలై ౨ న ప్రేమికుల దాడుల గురించి పోస్ట్ పూర్తిగా రాయలేదు.పూర్తి చేసేలోపే మళ్ళీ రెండో మూడో దాడులు జరిగాయి.అసలు వీళ్ళ ఆలోచనా ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు.ఇదొక మాస్ హిస్టీరియా లాగా వుంది.కేవలం ప్రకటనల తో ,కఠిన శిక్షలతో లాభం లేదు.వాటి పర్యవసనాలేమిటో ప్రభుత్వము వివరించాలి.నిందితుల్లో విద్యావంతులుండడం బాధించే విషయం. అంటే మన విద్యలో లోపం వుంది.కొన్ని కోర్సుల్లో మానవతా విలువలు నేర్పడం లేదు.సమాజం లో మనుషులు ఎలా మెలగాలో నేర్పడం లేదు.ఎదిగే వయసులో హార్మోన్లు చేసే అల్లరిని డైవర్ట్ చేసే విధంగా నో ,ఐడెంటిటీ క్రైసిస్ ని సంతృప్తి పరిచే విధంగా నో క్రీడలు,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏవీ లేవు.కలిసి పనిచెయ్యడంలో వుండే త్ర్హుప్తి ,ఆనందం ఏమీ తెలియడం లేదు.అందువల్ల ఎవరైనా అమ్మాయి మాట్లాడితే చాలు అది ప్రేమే అనుకుంటున్నారు.దీనికి తోడూ అర్ధ చదువు చదివిన ,అసలేమీ చదవని సినిమా దర్శకులు తీసే అర్థం లేని ,అనుభవం లేని,వూహాజనితమైన ,అపరిపక్వ ప్రేమ కథలతో కూడిన సినిమాలు నేటి యువతరానికి చేస్తున్న హాని ఎంతో వుంది.వీటికి తోడూ ఫూలిష్ ,సెన్సార్ లేని టి.వి.సీరియల్లు .
ఈ దాడులకు మొదటగా తల్లిదండ్రులది బాద్యత.తరువాత విద్య వ్యవస్థది.నెక్స్ట్ ప్రభుత్వం ,ఆ తరువాత సమాజం.
ఇప్పుడు అర్జెంటు గా చేయ వలసింది ఏమిటంటే క్రీడలని ప్రోత్సహించాలి.ప్రతి విద్యార్థి సైన్యంలో వొక సంవత్సరమైనా పనిచేయాలి.విద్యా వ్యవస్థలో నైతిక విలువలకు కొన్ని పాఠాలు వుండాలి.అర్థం లేని సినిమాలు ,టి.వి.సీరియళ్ళపై అదుపు వుండాలి.అన్నిటికి మించి ఇలాంటి దాడుల వల్ల బాధితుల &నిందితుల జీవితాలు ఎలా అర్ధంతరంగా ముగిసిపోతాయో ,ఎలాంటి బాధాకర పరిస్థితులు ఏర్పడతాయో ప్రచార సాధనాల ద్వార వివరించాలి.విద్యా సంస్థల్లో వీటి పైన చర్చ జరగాలి.మనం వుదాసీనత వహిస్తే ఇదొక అంటు వ్యాధిలా మారి సమాజాన్ని దహించే ప్రమాదం వుంది.

Thursday, July 2, 2009

ఈ దాడులు జీవితాన్ని తీర్చి దిద్దుతాయా ?

మళ్ళీ యాసిడ్ దాడులు ,రాగింగ్ ఈ రోజు వార్తల్లో !?వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రుల పోలీసుల వువాచ. ఇందులో తప్పు పట్టాల్సింది ఎవర్ని?అవును మొన్న ఓసారి ఇలాగే జరిగితే ఎన్కౌంటర్ చేసారు మరి పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మళ్ళీ మళ్ళీ అవే దాడులు. మరొక విషయం నిందితులు శిక్షకు సిద్ధమయ్యే వస్తున్నారు.అలాంటప్పుడు దాడులు ఎలా ఆగుతాయి?ఎలా ఆగుతాయంటే సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెదుకుతే .



ఈ దాడుల వెనుక నేర మనస్తత్వం కంటే సామాజిక కారణాలు వున్నాయ.పదిహేను నుండి పాతిక సం" వయస్సు అందమైన దశ అంతే ప్రమాదకరమైనది కూడా.ఈ దశ లో శరీరం లో హార్మోన్లు చేసే అల్లరి మనిషిని కుదురుగా వుండనీయవు.ముఖ్యంగా ప్రేమ విషయంలో .మన ముందు తరాల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే వారు కాబట్టి ఇలా ప్రేమ దోమ అనడానికి చాన్స్ లేదు.కాని ఇప్పుడు చదువు కేరీరు అంటూ పెళ్ళిళ్ళు లేటు కావడం వల్ల శరీరం లో కలిగే సహజ వాంచలను తీర్చుకో లేని పరిస్థితి ఇలాంటి వున్మాదస్థితి కి ప్రేరేపిస్తోంది.అందరిలోనూ ఈ పరిస్థితి వుండకపోవచ్చు.శాతాల్లోతేడా .ఈవ్టీజింగ్ అయినా రాగింగ్ అయినా కారణం ఆ వయసు లో కలిగే అలజడిని సరైన మార్గం లోకి మల్లించలేక పోవడమే.ఇందుకు కేవలం ఆ యా యువకులనే తప్పుపట్టలేం.ఇందులో సమాజం బాద్యత ప్రభుత్వ బాధ్యత కూడా వుంది .



ఈ వయసులో కలిగే వుత్సాహాన్ని ,వుల్లాసాన్ని సరైన చానల్ కి మల్లించాలి.ఇతర దేశాల్లో ప్రతి విద్యార్థి సైన్యం లో కొంత కాలం పని చెయ్యాలనే nibhandan వుంది.బ్రిటన్ రాకుమారుడు కూడా అల పనిచేసాడని ఇటీవలే వార్తల్లో చూసాం.దీని వల్ల యువతకి తన ఎనర్జీ కి వొక ఇంకొకమరొక విషయం.క్రమశిక్షణ ఏర్పడుతుంది.దేశభక్తి అలవడుతుంది.ఆరోగ్యంగా వుంటారు.ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఈ రూల్ పెడితే దేశం లో మధుమేహం అన్నదే వుండదు.

Saturday, May 16, 2009

మన జీవితము

ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన తిరుగులేని ఆయుధం . దీన్ని ప్రభుత్వ అధికారులు ఎంత తేలిగ్గా తీసుకుంటారో ఇటీవలి సంఘటనా ద్వారా తెలిసింది.ఈ ఎన్నికల్లో నాకు డ్యూటీ వేసారు.అలాగే పోస్టల్ బాలట్ కొరకు దరఖాస్తు చేసుకున్నాను.మిగతా వారికి పోస్టల్ బ్యాలట్ వచ్చింది కానీ నాకు రాలేదు.రెవిన్యూ ఆఫీస్ లో అడిగితే తొందరేముంది వస్తుందిలే అన్నారు.నెలరోజులు ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు. కౌంటింగ్ రెండు రోజులుందనగా తాసిల్దారుని అడిగితే దాని గురించి మర్చిపోండి ఇక రాదు అన్నాడు.మేము ఇదు మందిమి అక్కడ పోగైన వాళ్ళం అప్పుడే గ్రూప్ గా ఏర్పడి సమాచార హక్కు చట్టం ప్రకారం మాకు పోస్టల్ బ్యాలట్ ఎందుకు రాలేదో కారణం చెప్పమని దరఖాస్తు చేసుకున్నాం.దానికి కూడా వాళ్లు సహకరించరు.పట్టు విడవకుండా మేము పోరాటం చేస్తే దరఖాస్తు తీసుకుని రసీదు కూడా ఇవ్వమంటారు.గట్టిగా అడిగి రసీదు తీసుకున్నాం. దానికి చలాన్ కట్టాలి .ఆవిషయం తర్వాత చెప్పారు.ఈలోపు కౌంటింగ్ టైం అయిపొయింది. అయినా దీన్ని ఇంతటితో వదలకూడదని నిర్ణయించాం. రేపు సోమవారం వెళ్లి చలాన్ కట్టి మా అప్లికేషను చూడాలి.మాకే కాదు ఇంకో రెండువందల యాభై పైగా రిజెక్ట్ అయ్యాయి .వారంతావూరికే వున్నారు.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని మనం పొందకుండా ఇలా మౌనంగా వుండడం మంచిది కాదు.మీలో ఎవరైనా ఇలాంటి సమస్య వుంటే సమాచార హక్కు చట్టం ప్రయోగించంది.ఇది రాష్ట్ర వ్యాప్తంగా వున్నా సమస్య .ఒక వైపు పోలింగ్ డ్యూటీ కి వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటా మంటారు.మరో వైపు వోటు హక్కుకు ఇలా విఘాతం కలిగిస్తారు.ఇది న్యాయమేనా?అధికారులు సమాధానం చెప్పాలి.లేదా కోర్టులు జోక్యం చేసుకుని పరిష్కారం సూచించాలి.

Tuesday, May 5, 2009

మన జీవితము

జీవితం చిన్నదే ,ఆశాశ్వతమైనదే కావచ్చు కానీ విలువైనది అందమైనది కూడా.మనము సంతోషం గా వుండం దేవుడు మనకు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినా.ప్రకృతిని తృప్తిగా ఆస్వాదించే అవకాశం వున్నా ఆపని చేయం. కాళ్ళని చుట్టేసి ఎత్తుకోమని మారాం చేసే పిల్లల్ని పక్కకు తోసి పని వుందంటూ వెళ్లి పోతుంటాం.గుభాళించే పూలని ఆఘ్రానించటం మరచి పోతుంటాం.మంచి పాట వినిపిస్తున్నా అర్జెంటు పని గుర్తొచ్చి పరుగు తీస్తుంటాం .
గట్టిగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి మనం ఇష్టమైన కూర వండుకుని తీరిగ్గా తిని ఎన్నాళ్ళయింది (టీ.వీ.ఎదురుగా కూర్చోకుండా ). ఫ్రెండుతో ఏ అరమరికలు లేకుండా ,ఏ స్వార్థము లేకుండా మాట్లాడి ఎన్నాళ్ళయింది .పక్కవాడి కష్టానికి స్పందించి తోడుగా నిలిచి ఎంత కాలం అయ్యింది.ముద్దు లొలికే చిన్నారులతో ముచ్చట్లాడి ఎన్నిరోజులయింది.అసలు ఇలాంటి పనుల వల్ల కలిగే ఆనందం ఎంత బాగుంటుందో మనం గమనిస్తున్నామా . ప్రతి క్షణం విలువైనదే అని తెలిసినా అర్థవంతంగా జీవించటం ఎప్పటికప్పుడు మరచిపోతుంటాం.
ఏదో హడావుడి.అలజడి.పక్కవాడి కంటే పైనుండాలనే తాపత్రయం.వ్యాపార దృక్పధం .ఎంతో సంపాదించాలి ఏదో సాదించాలనే తాపత్రయం మనల్ని అన్ని ఆనందాలకు దూరం చేస్తోంది .దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేమా.మనం మనం గా బ్రతకలేమా.మరోసారి చర్చిద్దాం.