Saturday, May 16, 2009

మన జీవితము

ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన తిరుగులేని ఆయుధం . దీన్ని ప్రభుత్వ అధికారులు ఎంత తేలిగ్గా తీసుకుంటారో ఇటీవలి సంఘటనా ద్వారా తెలిసింది.ఈ ఎన్నికల్లో నాకు డ్యూటీ వేసారు.అలాగే పోస్టల్ బాలట్ కొరకు దరఖాస్తు చేసుకున్నాను.మిగతా వారికి పోస్టల్ బ్యాలట్ వచ్చింది కానీ నాకు రాలేదు.రెవిన్యూ ఆఫీస్ లో అడిగితే తొందరేముంది వస్తుందిలే అన్నారు.నెలరోజులు ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు. కౌంటింగ్ రెండు రోజులుందనగా తాసిల్దారుని అడిగితే దాని గురించి మర్చిపోండి ఇక రాదు అన్నాడు.మేము ఇదు మందిమి అక్కడ పోగైన వాళ్ళం అప్పుడే గ్రూప్ గా ఏర్పడి సమాచార హక్కు చట్టం ప్రకారం మాకు పోస్టల్ బ్యాలట్ ఎందుకు రాలేదో కారణం చెప్పమని దరఖాస్తు చేసుకున్నాం.దానికి కూడా వాళ్లు సహకరించరు.పట్టు విడవకుండా మేము పోరాటం చేస్తే దరఖాస్తు తీసుకుని రసీదు కూడా ఇవ్వమంటారు.గట్టిగా అడిగి రసీదు తీసుకున్నాం. దానికి చలాన్ కట్టాలి .ఆవిషయం తర్వాత చెప్పారు.ఈలోపు కౌంటింగ్ టైం అయిపొయింది. అయినా దీన్ని ఇంతటితో వదలకూడదని నిర్ణయించాం. రేపు సోమవారం వెళ్లి చలాన్ కట్టి మా అప్లికేషను చూడాలి.మాకే కాదు ఇంకో రెండువందల యాభై పైగా రిజెక్ట్ అయ్యాయి .వారంతావూరికే వున్నారు.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని మనం పొందకుండా ఇలా మౌనంగా వుండడం మంచిది కాదు.మీలో ఎవరైనా ఇలాంటి సమస్య వుంటే సమాచార హక్కు చట్టం ప్రయోగించంది.ఇది రాష్ట్ర వ్యాప్తంగా వున్నా సమస్య .ఒక వైపు పోలింగ్ డ్యూటీ కి వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటా మంటారు.మరో వైపు వోటు హక్కుకు ఇలా విఘాతం కలిగిస్తారు.ఇది న్యాయమేనా?అధికారులు సమాధానం చెప్పాలి.లేదా కోర్టులు జోక్యం చేసుకుని పరిష్కారం సూచించాలి.

No comments:

Post a Comment