Thursday, July 2, 2009

ఈ దాడులు జీవితాన్ని తీర్చి దిద్దుతాయా ?

మళ్ళీ యాసిడ్ దాడులు ,రాగింగ్ ఈ రోజు వార్తల్లో !?వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రుల పోలీసుల వువాచ. ఇందులో తప్పు పట్టాల్సింది ఎవర్ని?అవును మొన్న ఓసారి ఇలాగే జరిగితే ఎన్కౌంటర్ చేసారు మరి పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మళ్ళీ మళ్ళీ అవే దాడులు. మరొక విషయం నిందితులు శిక్షకు సిద్ధమయ్యే వస్తున్నారు.అలాంటప్పుడు దాడులు ఎలా ఆగుతాయి?ఎలా ఆగుతాయంటే సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం వెదుకుతే .



ఈ దాడుల వెనుక నేర మనస్తత్వం కంటే సామాజిక కారణాలు వున్నాయ.పదిహేను నుండి పాతిక సం" వయస్సు అందమైన దశ అంతే ప్రమాదకరమైనది కూడా.ఈ దశ లో శరీరం లో హార్మోన్లు చేసే అల్లరి మనిషిని కుదురుగా వుండనీయవు.ముఖ్యంగా ప్రేమ విషయంలో .మన ముందు తరాల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే వారు కాబట్టి ఇలా ప్రేమ దోమ అనడానికి చాన్స్ లేదు.కాని ఇప్పుడు చదువు కేరీరు అంటూ పెళ్ళిళ్ళు లేటు కావడం వల్ల శరీరం లో కలిగే సహజ వాంచలను తీర్చుకో లేని పరిస్థితి ఇలాంటి వున్మాదస్థితి కి ప్రేరేపిస్తోంది.అందరిలోనూ ఈ పరిస్థితి వుండకపోవచ్చు.శాతాల్లోతేడా .ఈవ్టీజింగ్ అయినా రాగింగ్ అయినా కారణం ఆ వయసు లో కలిగే అలజడిని సరైన మార్గం లోకి మల్లించలేక పోవడమే.ఇందుకు కేవలం ఆ యా యువకులనే తప్పుపట్టలేం.ఇందులో సమాజం బాద్యత ప్రభుత్వ బాధ్యత కూడా వుంది .



ఈ వయసులో కలిగే వుత్సాహాన్ని ,వుల్లాసాన్ని సరైన చానల్ కి మల్లించాలి.ఇతర దేశాల్లో ప్రతి విద్యార్థి సైన్యం లో కొంత కాలం పని చెయ్యాలనే nibhandan వుంది.బ్రిటన్ రాకుమారుడు కూడా అల పనిచేసాడని ఇటీవలే వార్తల్లో చూసాం.దీని వల్ల యువతకి తన ఎనర్జీ కి వొక ఇంకొకమరొక విషయం.క్రమశిక్షణ ఏర్పడుతుంది.దేశభక్తి అలవడుతుంది.ఆరోగ్యంగా వుంటారు.ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఈ రూల్ పెడితే దేశం లో మధుమేహం అన్నదే వుండదు.