Wednesday, March 17, 2010

మరి వీరి పై ఎవరు ధర్నా చేయాలి?

పైరసీ పై టాలివుడ్ నిరాహార దీక్షలు ధర్నా లు చేస్తోంది.పైరసీ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు?సినిమా టికెట్లు భారీ గా పెంచి సామాన్యుడికి వారే దూరం అయ్యారు.రిలీజ్ ఐన మొదటి రోజే మొత్తం దండుకోవాలని టికెట్ ఇదు వందల రూపాయలకు పెంచి అమ్ముతున్నారు.మరో వైపు బలిసిన హీరోలు ,ప్రోడ్యుసార్లు కలిసి చిన్న సినిమాలకు దియేటర్లు ఇవ్వకుండా చేసి చిన్న నిర్మాతలను నాశనం చేస్తున్నారు.మంచి సినిమాలు రాకుండా చేస్తున్నారు.ఫాల్సు ప్రిస్తేజి కోసం ,ఫాల్సు ఇమేజి కోసం ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తున్నారు.పిచ్చి కతలు పట్టుకుని కేవలం భారీ సెట్టింగులు చూపితే చాలు సినిమా ఆడేస్తుందని పిచ్చి ఊహలకు పోయి ప్రేక్షకులని దగా చేస్తున్నారు.మనం ఏదైనా వస్తువుని చూసి బాగుంటే నచ్చితే కొంటాం .కాని ఎలా వుంటుందో తెలియనిది నమ్మకంతో మాత్రమే వెళ్ళేది సినిమా వొకటే .అంట నమ్మకం తో వెళ్ళిన ప్రేక్షకున్ని దారుణంగా మోసం చేస్తున్నారు.ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి ,టికెట్ ధర తగ్గిస్తే పైరసీ అనేదే వుండదు.ఆ పని చెయ్యరు .ఎందుకంటే హీరోలు కోట్లు దండుకోవాలి,ప్రేక్షకుడు ,చిన్న నిర్మాతలు నాశనం కావాలి అనేది వారి సిద్ధాంతం.

No comments:

Post a Comment